
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరులో నరసమ్మ అనే 85 సంవత్సరాల వృద్ధురాలిని, ఆమె కుమారుడు ప్రసాద్ హింసిస్తున్న వీడియో మన కందుకూరు వార్తలు లో ప్రసారం కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.పట్టణ పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. అలాగే నరసమ్మతో మాట్లాడారు. అవసరమైతే ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించే ఆలోచనలో ఉన్నారు.