
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవికాలం ఆరంభం నుండి వేసవికాలం ముగిసే వరకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని అలాగే దాతల సహకారంతో వారానికి మూడు నుండి నాలుగు రోజులపాటు మధ్యాహ్నం వేళ్ళలో కొందరికైనా వేసవి తాపన్ని తగ్గించాలా, వారిలో కొంత దాహార్తిని అయినా తీర్చాలన్న సంకల్పంతో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్య అయినటువంటి యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు గుడ్లూరు వాస్తవ్యులు అద్దంకి అజయ్ కుమార్ గారి కుమారుడు కీ శే యశ్వంత్ సాయి తేజ 29వ జయంతిని పురస్కరించుకుని వారి సహకారంతో స్వీట్లు పంపిణీ మరియు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అలాగే వివిధ ప్రాంతాల నుంచి గుడ్లూరు వచ్చినటువంటి ఇతర గ్రామస్తులకు ఈ చల్లని మజ్జిగ, స్వీట్స్ అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేత్రపురి శ్రీరామ సేవకు సభ్యులు చిన్న మాట్లాడుతూ అజయ్ కుమార్ గారి పెద్ద కుమారుడు దురదృష్టవశాత్తు నాలుగు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందాడు.అంతటి దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని తన కుమారుని పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్టును స్థాపించి దాతల సహకారంతో వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తూనే ఉన్నారు. అలాగే పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందించి వారిని విద్యలో ప్రోత్సహిస్తున్నారు. అజయ్ గారి లాగా దుఃఖానికి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో నలుగురికి మంచి చేయాలన్న సంకల్పంతో సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటివరకు మా ఈ సేవ కార్యక్రమలకు సహకరించిన దాతలు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నేత్రపురి శ్రీరామసేవక్ సభ్యులు చిన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేత్రపురి శ్రీరామసేవక్ సభ్యులు మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు అలాగే ఆర్యవైశ్య మిత్రులు, మీడియా మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.