
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
,జరుగుమల్లి నూతన SIగా భాగ్యరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన బాపట్ల జిల్లా నుంచి బదిలీపై జరుగుమల్లి వచ్చారు. ఇక్కడ పనిచేసిన SI మహేంద్ర నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు.