
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారితో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు రూ.69 లక్షల 16 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజు అందజేసినట్లు మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.అద్దంకి నియోజకవర్గ పరిధిలో గత రెండు సంవత్సరాల కాలంలో CMRF కింద మొత్తం 2,938 మంది లబ్ధిదారులకు రూ. 25 కోట్ల 31 లక్షల 79 వేల రూపాయలు అందజేసినట్లు మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.