
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామంలో పొదుపు సంఘాల డ్వాక్రా మహిళలు ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి కాగితపు వస్తువులను ఉపయోగించాలని పాకల క్లస్టర్ సీసీ అన్నారు. శనివారం మండలంలోని పాకల క్లస్టర్లో పాకల, ఊళ్ళ పాలెం పంచాయతీలోని డ్వాక్రా మహిళలకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఊళ్ళ పాలెం పాకల పంచాయతీ అధికారులు వెలుగు సిబ్బంది పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.