
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసులు టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తురుపునాయుడుపాలెం గ్రామంలో జూదంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,780 నగదును స్వాధీనం చేసుకున్నారు.ప్రజల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.