
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఈ సమావేశంలో గౌరవ ఒంగోలు ఎం.పి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు, గౌరవ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మరియు ఎర్రగొండపాలెం టిడిపి పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.అలాగే మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత, IAS , జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాస్ గారు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.ఈ సమావేశంలో నూతన మార్కాపురం జిల్లా అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, ప్రజలకు మెరుగైన సేవల అందజేత, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మరియు అధికారుల పనితీరుపై సమగ్రంగా చర్చించి సమీక్ష నిర్వహించారు.