
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
దక్షిణ సింహచలంగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా బహిరంగ వేలం పాటలు సన్నెబోయిన శ్రీనివాసులు, చైర్మన్ ధర్మకర్తలి మండలి, పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ,కార్యనిర్వహణాధికారి పి.కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డు, కలకండ ప్రసాదములు పాట గత సంవత్సరం రూ.52,500/- , ప్రస్తుతం రూ.61000/- కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొను పాట గత సంవత్సరం రూ. 1,10,000/- , ప్రస్తుతం 1,51000/- కలకండ వగైరా ప్రసాదములు అమ్ముకొను హక్కు రూ.19000/- వచ్చాయి.అదేవిధంగా, కొబ్బరికాయలు అమ్ముకొను పాట,జెయింట్ వీల్ పాట వాయిదా వేయడం జరిగింది. బహిరంగ వేలం పాటలో 2,30,000/- ప్రస్తుతం ఆదాయం 68500/- పెరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీనరసింహాచార్యులు, కుంచాల రమణయ్య , ఉదయగిరి లక్ష్మీనరసింహ చార్యులు,రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య , మోతకాపులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.