
తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
గురువారం నాడు కొండపి లో సంయుక్త కిసాన్ మోర్చ సమావేశం జరిగింది,జిల్లావ్యాప్తంగా అన్ని టొబాకో బోర్డులు వద్ద ఈనెల 25వ తేదీన నిరసన జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది .అందులో భాగంగా గురువారం కొండేపిలో జరిగిన సమావేశంలో నిరసన కార్యక్రమానికి బోర్డు పరిధిలో ఉన్న గ్రామాల నుండి రైతులందరూ హాజరుకావాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తుంది .గురువారం కొండేపిలో జరిగిన సమావేశంలో జిల్లాలో పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వైవి కృష్ణారావు కేజీ మస్తాన్ ఆర్ లక్ష్మి గుల్లపల్లి వెంకట్రావు పాల్గొన్నారు