
తొలి శుభోదయం న్యూస్ కొమరోలు:-
కొమరోలు మండలం కత్తులవానిపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ఎస్సై నాగరాజు పోలీసు సిబ్బందితో.కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు.సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పరిశీలించి 8 వాహనాలకు జరిమానా విధించారు.గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.అంతేకాకుండా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి అనుమానిత వ్యక్తులు గ్రామాలలోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రామకోటయ్య గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.