
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని హజరత్ గూడెం గ్రామంలో కంభం మండలం ఎస్సై శివకృష్ణారెడ్డి ఈరోజు ఆదివారం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు తదితర అంశాలపై గ్రామస్థులు, గ్రామంలోని సీనియర్ సిటిజన్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఇంకా ఎవరైనా అనుమానిత వ్యక్తులు గ్రామంలో సంచరిస్తూ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.