
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు డిప్యూటీ డిఈఓగా బాధ్యతలు స్వీకరించిన T. రవి …. బుధవారం కందుకూరులో MLA ఇంటూరి నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈయన ప్రస్తుతం నాగులుప్పలపాడు ఎంఈఓ గా పనిచేస్తూ, కందుకూరుకు ఇంచార్జి డిప్యూటీ డిఈవో గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కందుకూరు పూర్వ ఎంఈఓ అజయ్ బాబు, ఉపాధ్యాయులు తల్లపనేని శ్రీనివాసరావు, ఏలూరి బ్రహ్మయ్య, తొట్టెంపూడి రామచంద్ర, ఇంటూరి శ్రీనివాసరావు, సోమినేని రవిచంద్ర, ఆరెబోయిన వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాసరావు, పి.రామమోహన్, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.