
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం వద్ద నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట చిన్నారుల గల్లంతు విషయం తెలుసుకున్న మంత్రి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సాయంత్రానికి చిన్నారుల మరణ వార్త తెలుసుకున్న మంత్రి స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వేసవి సెలవుల్లో పిల్లలను చెరువులు, వాగులు వద్దకు వెళ్లకుండా వారిని ఓ కంట కనిపెడుతూ తల్లిదండ్రులు తగిన భద్రత చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.