
కంటైనర్ వాహనం ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడిక్కడే మృతి.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై, వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కందుకూరులో జరిగిన ఒక ఫంక్షన్కు హాజరై తిరిగి సింగరాయకొండకు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా, కంటైనర్ వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.సింగరాయకొండకు చెందిన షేక్ నాగూర్ వలి ద్విచక్ర వాహనం నడుపుతుండగా, బైక్ వెనుక కూర్చున్న ఇద్దరు వృద్ధులు — అల్లి ఖాన్ మరియు నాగూర్ బి — ప్రమాదంలో ఘటన స్థలంలోనే మృతి చెందారు. అయితే వాహనం నడుపుతున్న షేక్ నాగూర్ వలికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మరియు హైవే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ను ఒంగోలు సమీపం లో అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.