
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ABM పాలెం లో కిడ్నీలు దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మౌలాబీ కుటుంబానికి యూత్ సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. బియ్యం నిత్యవసరకులు వారి ఇంటికి వెళ్లి అందజేశారు. అంతే కాకుండా వికలాంగుడు బాబులు కుటుంబానికి యూత్ సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు బియ్యం నిత్యవసర సరుకులను అందజేశారు. దాతలు గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ గారు, మరియు యూత్ సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు తోట.శ్రీనివాసులు, వినుకొండ చిట్టిబాబు,వెంకీ రసూల్ , శశి కుమార్ రెడ్డి టంగుటూరు వెంకీ సహకారంతో మౌలాబీకి, బాబులుకు నిత్యవసర సరుకులు బియ్యం అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకుంటామని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.