
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
'మీకోసం', స్పెషల్ గ్రీవెన్స్, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువవుతోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోనని ప్రకాశం జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ పి. రాజాబాబు, ఐ.ఏ.ఎస్. స్పష్టం చేశారు.ప్రకాశం భవన్లో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)” కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం సాధ్యం కాని సందర్భాల్లో కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.