google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం:ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ రాయిపాటి ప్రసాద్ రావు, యోగా మాస్టర్లు గోపాల రెడ్డి, టి. వెంకట లక్ష్మీ ప్రసన్న, అలాగే ఒంగోలు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్కు చెందిన ఆలా మధుసూదన్, విజయలక్ష్మి గార్ల వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా యోగా నిపుణులు యోగాభ్యాసం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను వివరించి, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి సూచనలను అనుసరిస్తూ అధికారులు, సిబ్బంది వివిధ యోగాసనాలను సాధన చేశారు.ఈ సందర్భంగా ఒంగోలు డిఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది రోజూ విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అలాంటి ఒత్తిడిని తగ్గించుకొని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగాసనాలను నిత్యం జీవన విధానంలో భాగం చేసుకోవాలని,
యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శరీరం, మనసు మధ్య సమతుల్యం ఏర్పరిచే గొప్ప విన్యాసాలని, ఆలోచనలకు, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో దోహదపడుతుందన్నారు. యోగాతో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం, సమాజం కూడా బాగుంటుందని తెలిపారు. కావున యోగాని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, దీనిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు వన్ టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, CCS ఇన్స్పెక్టర్ కమలాకర్ రావు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు, ఆర్ఐ రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
