google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

డిఎస్పీ గారి కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీస్ అధికారులు.
డిఎస్పీ గారి కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ఇంటెలిజెన్స్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వేలమూరి శ్రీరామ్ గారు 11.06.2026 తేదీన తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో ఆకస్మికంగా మరణించారు. అనంతరం డీఎస్పీ గారి పార్థివ దేహాన్ని ఒంగోలులోని మంగమూరు రోడ్డులో, గాయత్రి దేవి ఆలయానికి ఎదురు స్ట్రీట్ నందు గల Lake View Apartment లో ఉంచగా ఇంటిలిజెన్స్ ADG శ్రీ మహేష్ చంద్ర లడ్హా ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు, ఇంటెలిజెన్స్ ఎస్పీ లు శ్రీ రామ్మోహన్ రావు ఐపీఎస్ గారు, శ్రీమతి లావణ్య లక్ష్మి ఐపీఎస్ గారు, శ్రీమతి రమాదేవి ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ శ్రీ ఖాదర్ బాషా గారు మరియు పోలీసు అధికారులు డీఎస్పీ గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలియజేశారు.డీఎస్పీ గారి మరణం ఎంతో బాధాకరమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన డీఎస్పీ గారి కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు ఓదార్చి, వారికి మనోధైర్యం నింపుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన డీఎస్పీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.