google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
గిద్దలూరు మండలంలోని కృష్ణ శెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత వైద్యాధికారులను ఆదేశించారు. ఈనెల చివరివారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించునున్న. నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో చేయాల్సిన మరమ్మత్తులు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వసతుల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సంజీవిని పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సభా స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేవిషయాన్నిఅధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, జిల్లా మలేరియా అధికారి కే.రాహుల్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.