
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-
PMEGP కింద మంజూరైన కియా కారును మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన లబ్ది దారురాలు మేలం అనిత కుటుంబ సభ్యులకు తూర్పు నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అందజేశారు.( దీని యూనిట్ విలువ రూ.10 లక్షలు, సబ్సిడీ 3,50,000 ) ఈ సందర్భంగా లబ్ధిదారురాలు కుటుంబ సభ్యులు మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.