తొలి శుభోదయం కందుకూరు:-

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ కమిటీకి కందుకూరు నియోజకవర్గం నుంచి ఇటీవల నియమితులైన సభ్యులు, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పదవులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యేకు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు.పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా (రూబీ) లు ఎమ్మెల్యే ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కొక్కరికి స్వీట్ తినిపించి, శాలువాతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, పదవులు వాటంతటవే వస్తాయని అన్నారు. పదవులు పొందిన వారంతా పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తూ… మరెన్నో ఉన్నత పదవులు పొందేలా కష్టపడాలని ఎమ్మెల్యే నాగేశ్వరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు పార్టీలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *