తొలి శుభోదయం టంగుటూరు:-
జనసేన పార్టీ టంగుటూరు మండలం ప్రధాన కార్యదర్శి మరియు వల్లూరమ్మ దేవస్థానం మెంబర్ సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన చనగర రాజేష్ గారికి రెండు రోజుల క్రితం ఒంగోలులో యాక్సిడెంట్ అయ్యింది, ప్రస్తుతం చనగర రాజేష్ ఒంగోలులో ఉషా మల్టీస్పెషాలిటి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, వారిని గురువారం పరామర్శించి వివరాలు తెలుసుకుని, డాక్టర్ గారితో మరియు రాజేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్.