తొలి శుభోదయం కొండేపి నియోజకవర్గం :-
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యునిగా నియమించడం జరిగింది. సోమవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యాలయంలో పదవి బాధ్యత స్వీకార మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, జనసేన పార్టీ మార్కాపురం ఇన్చార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్, అద్దంకి శ్రీకృష్ణ , నందికొట్కూరు వెంకట్ , తాటికొండ ఇన్చార్జి విజయ్ శేఖర్ , ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ జడ బాలనాగేంద్ర , కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ , పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు , బెల్లంకొండ గోపి, విజయరావు, నరసింహారావు లు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు కి శుభాకాంక్షలు తెలియజేశారు.