తొలి శుభోదయం :-ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు–ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ సందర్భంలో, వాగు దాటేందుకు ప్రయత్నించిన మైనంపాడు టిటిసి కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు వద్ద భద్రతా చర్యల కోసం వీఆర్వో, వీఆర్ఏలను ఇన్‌చార్జీలుగా నియమించారు.కానీ వారు భోజనానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని గుర్తించిన జిల్లా కలెక్టర్, తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *