తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

నేరాలను అరికట్టడం మరియు ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచుతూ, అనుమానాస్పద వాహనాలు మరియు వ్యక్తులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ నేరాల నివారణకు కృషి చేస్తున్నారు.అదేవిధంగా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని గుర్తు చేస్తూ, నిబంధనలు పాటించని వారిపై చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సురక్షిత ప్రయాణానికి అవసరమైన సూచనలు అందిస్తున్నారు.
ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరిస్తే, సమాజంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *