ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా వాహన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఓవర్‌లోడెడ్ ఆటోను ఆపి, డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను హానిలోకి నెడుతూ అధిక సంఖ్యలో ప్రజలను వాహనాల్లో ఎక్కించుకోవడం ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు వారికి సూచించారు.అతిభారీ ప్రయాణికులను తీసుకెళ్లినందుకు ఆటో డ్రైవర్‌పై జరిమానా కూడా విధించారు. ప్రజల ప్రాణ భద్రత కోసం వాహన సామర్థ్యానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని, ఓవర్‌లోడ్ చేసే డ్రైవర్లను గమనించినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రజల భద్రతను కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *