తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పునుగోడు గ్రామాన్ని కనిగిరి ఎస్ఐ సందర్శించి, పీజీఆర్ఎస్ (మీ కోసమ్) ద్వారా వచ్చిన పిటిషన్లపై పిటిషనర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ (మీ కోసమ్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలకు పరిష్కారం చూపడమే పోలీస్ శాఖ లక్ష్యమని, ప్రజల విశ్వాసంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని కనిగిరి ఎస్ఐ తెలిపారు.