తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో సోమవారం ఆమె ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ఈ పథకం కింద నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 2.50 లక్షల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు. త్వరితగతిన ఎక్కువ గృహాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకం కింద నియోజకవర్గంలో 3241 ఇళ్లను పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం రూ. 3లక్షల వరకు ఈ పధకము కింద లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పి. ప్రభాకర్, జిల్లా హౌసింగ్ పీడీ మోహన్ రావు, డీఈ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, కూటమి నాయకులు బాబి, సాగర్, మద్దెల లక్ష్మి, షబానా తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *