తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి, రోడ్డు భద్రత ప్రాముఖ్యత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైక్లింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ర్యాలీ సందర్భంగా పాల్గొన్న వారికి పోలీసులు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలు, స్పీడ్ నియంత్రణ, రోడ్డు భద్రత యొక్క ప్రాధాన్యత వంటి విషయాలను తెలియజేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పరిశుభ్రమైన పర్యావరణం కోసం సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని ప్రజలకు సందేశం అందించారు.ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధి, భద్రతలో భాగస్వాములు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *