తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, టెక్నాలజీ ఆధారిత దర్యాప్తును వేగవంతం చేస్తూ పనిచేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి ప్రజలకు సేవలందించారు.PC పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయగా, సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. టెక్నికల్ టీమ్ సహకారంతో మిస్సింగ్ మొబైల్ ఫోన్ను ట్రాక్ చేసి, స్థానాన్ని గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మొబైల్ ఫోన్ను యజమానికి సురక్షితంగా తిరిగి అందజేశారు.అధికారులు మాట్లాడుతూ—
ప్రజలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని, టెక్నాలజీని వినియోగించి వేగంగా దర్యాప్తు చేస్తామని,
మొబైల్ మిస్సింగ్ కేసులలో సకాలంలో స్పందించడం వల్ల ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని,
ప్రజలు ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో PC పల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు, టెక్నికల్ టీమ్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.