తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని ఇదిగామిట్ట దర్గా వద్ద నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో
“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని
ప్రభుత్వ మెడికల్ విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.