తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి 4 రోడ్ల కూడలి వద్ద చలివేంద్రాన్ని ఎస్ఐ నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎస్సై అన్నారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రజలకు దాహాన్ని తీర్చేందుకు మట్టికుండల్లో చల్లటి నీటిని ఏర్పాటు చేశామని ప్రజలు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకొని తమ దాహాన్ని తీర్చుకోవాలని ఎస్ఐ నాగరాజు విజ్ఞప్తి చేశారు……