తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపల్లి గ్రామం అవుట్‌స్కర్ట్స్‌లో జూదం ఆడుతున్న వారి‌పై మద్దిపాడు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 3 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.2,200/- నగదును స్వాధీనం చేశారు.ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జూదం, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలలో భాగంగా మడ్డిపాడు ఎస్సై ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టబడింది. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *