తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించే ముఖ్యమైన సాధనమని పోలీసులు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, వేగ పరిమితులు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు వాటి తీవ్రతను ఉదాహరణలతో వివరించారు.పోలీసులు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా వ్యక్తిగత భద్రతకు అత్యవసరమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తన భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.