తొలి శుభోదయం ప్రకాశం:-
ముంథా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తూ,
“తుఫాన్ కారణంగా విద్యార్థులు ప్రయాణాల్లో ఇబ్బందులు పడకూడదు. భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం,” అని పేర్కొన్నారు.అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను వాగులు, చెరువులు, నీటి ప్రవాహాల ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంచాలని సూచించారు.