తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-

సంఘసంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా…. కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే నిస్వార్థమైన విశేష సేవలు అందించారని అన్నారు. జీవిత చరమాంకంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రజాసేవ కోసం పరితపించారని తెలిపారు. స్త్రీలకు విద్య నేర్పేందుకు సావిత్రీబాయి పూలేతో కలిసి గొప్ప కార్యక్రమానికి తన ఇంటినుంచే శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని నాగేశ్వరరావు సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, నియోజకవర్గ వాణిజ్య విభాగ కమిటీ అధ్యక్షుడు మోదడుగు వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పులి నాగరాజు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు వేణు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్, పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీను, భవనాసి వెంకటేశ్వర్లు, గుమ్మా శివ, మచ్చా మనోహర్, శ్యామ్, ఫిరోజ్, చెంచు నారాయణ, రమణయ్య, శివరామకృష్ణ, కొండలరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *