కార్యక్రమంలో పాల్గొన్న జనసేన మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామ సచివాలయం నందు ఈరోజు మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం లో రైతులకు ప్రభుత్వ. రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగినది గత ప్రభుత్వం రీసెర్వే పేరుతో రైతుల్ని అయోమయంలో పడటమే కాకుండా ఒకరి భూమి మరొకరికి తప్పులు దొర్లడమే కాకుండా నాటి ముఖ్యమంత్రి ఫోటోనే ప్రచురించి ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగినది కానీ కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా వృద్ధా కాకూడదు రైతులు కష్టం వారిదే కాబట్టి వారి పాసుపుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రలతో కూడిన ముద్రలు ప్రచురించి గతంలో జరిగిన రీ సర్వే తప్పులను కూటమి ప్రభుత్వం మళ్లీ సర్వే చేయించి వారి పొలాలకు కరెక్టేనా ఎల్పీ నెంబర్లు వేసి రైతులకు న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కొండేపి నియోజకవర్గంలో ప్రజలకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది రైతులకు గాని ప్రజలకు గాని ఏ సమస్య వచ్చినా కూటమి నాయకులం. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తాసిల్దారు . ఎంపీడీవో కనుమళ గ్రామ సర్పంచ్ సొసైటీ చైర్మన్ బైవరపు మోహన్ రావు సింగయ్య జనసేన మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ కూటమి నాయకులు పాల్గొనడం జరిగినది.
