తొలి శుభోదయం కందుకూరు:-
వలేటివారిపాలెం మండలంలో విధులు నిర్వహించే ముగ్గురు ఉపాధ్యాయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. కత్తి ఐజాక్ డేవిడ్, నల్లమల్లి కుమార్, ఏలూరు చిన్న బ్రహ్మయ్యల యోగక్షేమాలు విచారించి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.