తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపొందించడం, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన–కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.సంతనూతలపాడు ఎస్‌ఐ ఆధ్వర్యంలో RGUKT SSN కాలేజ్‌ను సందర్శించిన పోలీసులు విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమై, విద్యా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, డ్రగ్స్‌ నివారణ, ట్రాఫిక్ నియమాలు, మహిళా భద్రత వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను నేరుగా అడిగి, పోలీసుల నుండి విలువైన మార్గదర్శకత్వం పొందారు.అదే విధంగా, మార్కాపురం జిల్లా పోలీసుల సమన్వయంతో పామూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్ విద్యార్థినులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించబడింది. బాలికల భద్రత, ఆత్మవిశ్వాసం, చట్టపరమైన రక్షణలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే మార్గాలు, మంచి అలవాట్లు–మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రాయోగిక సూచనలు అందించారు.ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చట్టంపై అవగాహన పెరిగి, భద్రత పట్ల చైతన్యం మరింత బలపడిందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *