తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,మార్కాపురం పోలీస్ :-

ప్రజలలో అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యతను బలపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘ఫేస్ వాష్’ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు మరియు ప్రజల్లో సామాజిక క్రమశిక్షణ, మంచి విలువలు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేలా సూచనలు ఇచ్చారు. పోలీసు అధికారులు ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలతో మమేకమై, భద్రత, ట్రాఫిక్ నియమాలు, నేర నివారణ, మహిళలు–పిల్లల రక్షణ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.‘ఫేస్ వాష్’ కార్యక్రమం అనగా సమాజంలో ప్రతికూల ప్రభావాలు చూపే అలవాట్లు, అసాంఘిక చర్యల నుంచి బయటపడేందుకు ఒక అవగాహనాత్మక ప్రయత్నమని అధికారులు తెలిపారు. ప్రజలు పోలీసు శాఖతో సహకరిస్తూ చట్టాలను గౌరవించినప్పుడు మాత్రమే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేస్తామని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, మంచి మార్గంలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *