తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:-
ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన ఒక గర్బిణి మహిళ ప్రసవ వేదనతో ఉండగా 108 సహయంతో ఒంగొలు తరలిస్తుండగా మార్గమద్యలో నొప్పులు ఎక్కువ కావడంతో చీమకుర్తి సమీపంలో 108 సిబ్బంది సహకారంతో ప్రసవించింది.ఎటువంటి ప్రమాదం లేకుండా తల్లి,బిడ్డ ఇద్దరు ఆరొగ్యంగా ఉండటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.ప్రసవించిన మహిళను బిడ్డను చీమకుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు.గర్బిణి స్త్రీ పండంటి మగబిడ్డ కు జన్మనియడంతో ఆనందం వ్యక్తం చేశారు.108 సిబ్బంది శివ,సుభానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.