తొలి శుభోదయం న్యూస్ ​ఒంగోలు:-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లాను గంజాయి రహితంగా మార్చే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ కాలేజీ నందు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
​కార్యక్రమ ముఖ్యాంశాలు:

​పాల్గొన్న అధికారులు: టాస్క్ ఫోర్స్ CI యు. సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్. ASI షేక్ మహబూబ్ బాషా, కాలేజీ ప్రిన్సిపాల్ యోగయ్య చౌదరి , ప్రకాశం జిల్లా ఈగల్ టీం సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
​అవగాహన:
గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను అధికారులు విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళన మరియు అడిక్షన్ వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో సోదాహరణంగా వివరించారు.
​చట్టపరమైన చర్యలు:
భారతదేశంలో గంజాయిని కలిగి ఉండటం, అమ్మడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల విద్యార్థుల కెరీర్ మరియు పాస్‌పోర్ట్ వంటి విషయాల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి హెచ్చరించారు.
​ప్రతిజ్ఞ: కార్యక్రమం చివరలో విద్యార్థులందరితో గంజాయికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. “మేము గంజాయి వాడబోమని, అక్రమ రవాణాకు సహకరించబోమని, గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తామని” విద్యార్థులు ఏకగ్రీవంగా ప్రమాణం చేశారు.​ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ASI షేక్ మహబూబ్ బాషా గారు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *