తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ఇంటర్ ఫలితాల్లో దర్శి మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. M. కోమలి (MPC) 465/470, P. అర్చన (BiPC) 451/455 మార్కులు సాధించి దర్శి టౌన్లో 2వ ర్యాంక్లు పొందారు.ఈ సందర్భంగా విద్యార్థులను సత్కరించి అభినందించిన డా గొట్టిపాటి లక్ష్మీ గారు, విద్యారంగంలో నారా లోకేష్ నాయకత్వంలో వస్తున్న మార్పులు ప్రశంసనీయమని తెలిపారు.మోడల్ స్కూల్లలో మెరుగైన వసతులు, సాంకేతిక విద్య, నాణ్యమైన భోజనం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపి ,అలానే పేర్కొన్నారు. అన్ని పాఠశాలలు ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.