తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అనుకూల పరిస్థితులు కల్పించడమే ఈ బందోబస్త్ ప్రధాన లక్ష్యం.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ, గుమికూడే వ్యక్తులపై మరియు అనుమానాస్పద కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ముఖ్యంగా పరీక్షా సమయాల్లో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. “విజిబుల్ పోలీసింగ్” పద్ధతి ద్వారా పోలీసుల నిరంతర ఉనికిని చాటుతూ, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించబడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ పరీక్షల సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *