తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు, ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వివి రమణ మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, తక్షణ పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు అధికారులు భరోసా ఇచ్చారు.పోలీస్ అధికారులు అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ మోసాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు, మరియు ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని, చట్టపరంగా చర్యలు చేపట్టడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వివి రమణ, సింగరాయకొండ ఇన్స్పెక్టర్ హాజరత్తయ్య, గుడ్లూరు ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సంతమాగులూరు సిఐ కె.వెంకటరావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, ప్యానల్ అడ్వకేట్ బి. బాలాజీ సింగ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *