తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

మార్కాపురం మండల పరిధిలోని ఎండువారిపాలెం గ్రామ సమీపంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే గోప్య సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి ఆకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి రూ. 8,900 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 2 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో చర్చనీయాంశమైంది.పోలీసుల ప్రకారం, నిందితులు కొంతకాలంగా అక్కడే గుంపులుగా చేరి జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో పోలీసులు దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఇలాంటి అక్రమ చర్యలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *