తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పదో తరగతి ఫలితాల్లో కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో కేతన్ 583 మార్కులతో ప్రథమ స్థానం సాధించి టాపర్గా నిలిచాడు. జోయల్ సుధాకర్ 581 మార్కులతో ద్వితీయ స్థానం దక్కించుకున్నాడు.అలాగే D. అభిషేక్ 569 మార్కులు, B. రామకృష్ణ 545 మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. చరణ్ 535, సుభాన్ అజీద్ 532, K. సందీప్ 522, G. తేజ 516, ప్రణయ్ కుమార్ 513 మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, ఉపాధ్యాయులు అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.