తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రంజాన్ పండుగను పురస్కరించుకుని…. కందుకూరు పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్ సలాం ఇంట్లో శనివారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , ఇతర నాయకులు విందులో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కి సలాం కుటుంబ సభ్యులు స్వాగతం పలుకగా… వారికి ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విందులో పెద్ద మసీదు ప్రెసిడెంట్ మొతిహార్, రియాజ్ మౌలానా, ఫైరోజ్ మౌలానా, యాసిన్ మౌలానా, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ గారి పొర్యేషన్ చైర్మన్ చిలకపాటి మధు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాదు, నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, హలో టిడిపి నేతలు రాయపాటి శ్రీను, గోచిపాతల మోషే, వడ్డెళ్ళ రవిచంద్ర, చుండూరి శ్రీను, తల తోటి మస్తాన్, షేక్ సలాం, షేక్ ఖలీల్, నజీర్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.