తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
రేగడిచెలిక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.చేనేతలకు నేటి నుంచి అమలు కానున్న ఉచిత విద్యుత్ పధకం.- ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే గమేషా కంపెనీ స్థాపన. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ. రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం తీసుకుంటుంది.మంగళవారం కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లతో పాటు 15 లక్షలతో నిర్మించిన పంచాయితీ కార్యాలయ ప్రహారి గోడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.