తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, అర్ధవీడు మండల పరిధిలోని కకర్ల డ్యామ్ సమీపంలో కొందరు వ్యక్తులు రహస్యంగా జూదం (పేకాట) ఆడుతున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది.దీనిపై స్పందించిన అర్ధవీడు ఎస్ఐ (SI) తన సిబ్బందితో కలిసి సదరు ప్రాంతంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 56,300/- నగదును, పేకాట సామగ్రిని మరియు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై చట్టపరమైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎవరైనా జూదం, బెట్టింగులు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఇటువంటి అక్రమ పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.